గతనెల కబుర్లు: అవతారంగారి నారాయణగారి బాబి - 3 - మూడాటలు-ఆరుస్వారీలు
SLC లోకొచ్చాను.
ఫస్ట్ ఫారం నుంచి SLC వరకు మాతో పాటు ఆరుగురు ఆడపిల్లలు, ముప్ఫయి నాలుగు మంది మగపిల్లలం - మొత్తం నలభై మంది మా క్లాసులో.
SLC లో వెంట్రప్రగడ జగన్నాథరావుగారని మా హెడ్మాస్టరు - ఆయన కూడా క్లాసులు తీసుకునేవారు. అనాతవరం నుంచి తెలుగు మాస్టారు - కర్రా చంద్రశేఖర శాస్త్రిగారు, ఆకెళ్ళ సుబారావుగాని ఇంకొక టీచరు వచ్చేవారు. వెంట్రప్రగడ జగన్నాథరావుగారు భీమనపల్లిలో ఉండేవారు.
ఆరుగురు ఆడపిల్లల్లో ఒకమ్మాయి మా సుబ్బన్న మాస్టారి కూతురు - పరిమి సుబ్బలక్ష్మి. ఇంకొకామేమో సోషల్ మాస్టారి కూతురు కృష్ణవేణి. ఇంకొకమ్మాయేమో గుండాబత్తులప్రభావతి అని అనాతారం నుంచే వచ్చేది - మిల్లు వాళ్ళమ్మాయి. ఇంకో అమ్మాయి మారిశెట్టి సూర్యకుమారి అని. ఇంకొక అమ్మాయేమో క్రిస్టియన్ అమ్మాయి - డోరాగ్రేస్ అని. ఆరో అమ్మాయి పేరు గుర్తు లేదు. ఈ ఆరుగురు ఆడపిల్లలు ఫస్టుఫారం నుంచీ మాతోనే కలిసి చదువుకున్నారు.
మాకు SLC లోకి వచ్చేటప్పటికి మాథ్స్లో కాంపోజిట్టు, జెనరల్ అని రెండుండేవి. ఈ కాంపోజిట్టు కొంచెం కష్టం - ఆ ఈక్వేషన్స్ అవీ నాకు వచ్చేవి కావు. అసలే ఆల్జీబ్రా - గుండె గాబ్రా కదా! అందుకని నేను జెనరల్ తీసుకున్నా. క్లాసుని A, B సెక్షన్లు చేశారు. ఎవరి సెక్షన్ వాళ్ళం వున్నా - మాథ్స్కి మాత్రం కాంపోజిట్ వాళ్ళందరూ ఒక క్లాసుకి, జెనరల్ వాళ్ళం ఒక క్లాసుకి వెళ్ళేవాళ్ళం. ఈ రావడం - పోవడంలో ఏమైందంటే - ఒకరోజు - ఒక అమ్మాయిని - ఎవరితోనో ఆట్లాడుతూ పరిగెత్తుతూ వెళ్తూ - చూసుకోకుండా గుద్దేశాను. ఆ అమ్మాయి చేతిలో పుస్తకాలు కిందపడిపోయాయి. నేను నవ్వుకుంటూ పారిపోయాను.
అది మా హెడ్మాస్టరు చూశారు - ఎక్కడో దూరం నుంచి.
ఆయన దగ్గర ఒక అలవాటుండేది - ఆయనదగ్గర మాం... ఛి పేకబెత్తమొకటి ఆయన రూములో ఉండేది. ఆయన ఎవరినయినా కొట్టాలనుకుంటే వాడినే పంపించి ఆ బెత్తం తెప్పించేవారు. తెప్పించి చితగ్గొట్టేహేసేవారన్నమాట.
నన్ను పిలిచి "ఒరే వడ్లమానీ! అక్కడ సత్యం ఉంటాడు - వాణ్ణడిగి నేనిమ్మన్నానని చెప్పి ఆ బెత్తం తీసుకురా! " అన్నారు.
సత్యం అంటే మా బళ్ళో గంటలు కొట్టే అటెండరు.
నాకప్పుడే అర్థం అయిపోయింది - మనకు మూడింది ఇవాళ అని.
సరే! వెళ్ళాను ఊపుకుంటూ హెడ్మాస్టరు గారి ఆఫీసుకి.
సత్యం, రాజు అని ఇద్దరు ఉండేవారు. దసరా వచ్చిందంటే చెరో రెండు రూపాయలు ఇచ్చేవాణ్ణి - ఆ రోజుల్లోనే. అది అప్పటికి చాలా గొప్ప. అంచేత నేనంటే వాళ్ళకి - పాపం - ప్రత్యేక అభిమానం ఉండేది.
"సత్యం! హెడ్మాస్టరు బెత్తం తెమ్మన్నారు - అది ఇటియ్యి" అన్నాను.
వాడికి తెలుసు నన్నే కొట్టేస్తారని.
అయినా కూడా "ఎవరికీ మూడింది బాబూ ఇవాళా ?" అనడిగాడు.
"ఏమో - నాకేం తెల్సు. ఎవడో అల్లరి చేశాడు లోపల - నన్ను బెత్తం తీసుకు రమ్మన్నారు" అన్నాను.
"సరే అయితే - తీసుకెళ్ళు బాబూ!" అంటూ భద్రంగా ఇచ్చాడు బెత్తం.
ఆ బెత్తం పట్టుకుని వచ్చాను.
వచ్చేటప్పటికి "చెయ్యి పట్టమ్మా!" అని రెండు చేతులూ చాచి పెడితే తెగ బాదేహారు. చేతులు ఉబ్బిపోయినై.
ఆ ఉబ్బిపోయిన చేతులతో - ఇంకా రోజుకి ఆటల్లేవు - ఎలాగోలా కష్టపడి సైకిలు తొక్కుకుంటూ ఇంటికివెళ్ళాను.
అన్నం తినడానిక్కూడా లేదు - చేతులంతా మంటలు. మా అమ్మే - ఉయ్యాలబల్ల మీద కూర్చోబెట్టి - నోట్లో పెట్టేహేది అన్నం.
మా నాన్నగారికి అనుమానమొచ్చింది.
"ఏమైందిరా అది?" అనడిగారు.
"అబ్బే! ఏం లేదు. ఆడుతూ ఆడుతూ చేతులు కింద ఆనించేశాను. అక్కడ రాళ్ళేవో వున్నాయ్. అంచేత అవేవో తగిలాయి" - అనేదో అబద్ధం ఆడేశాను.
ఈ లోపులో - తెలుగు మాస్టారు - మా చుట్టం కూడా ఆయన - కర్రా చంద్రశేఖరశాస్త్రిగారు - ఆయనొచ్చారు.
వచ్చి - "నారాయణగారూ! - ఏడీ ఉన్నాడా మనవాడూ ?!" అన్నారు.
"ఆ రండి మాస్టారూ - ఏంటి సంగతి?" అన్నారు మా నాన్న.
"ఏం లేదు - ఇవాళ వీడూ ... ఏదో అల్లరి చేసుకుంటూ వచ్చి ఓ అమ్మాయిని గుద్దేహాడు. హెడ్మాస్టరు పట్టుకుని చితక్కొట్టేహాడు. ఎలా ఉన్నాడో చూద్దామని వచ్చాను" అన్నాడాయన.
ఇంక చూసుకోండి మా నాన్నగారు మళ్ళీ ఫుట్బాల్ ఆడేశారు నన్ను - ఇంకెప్పుడూ మళ్ళీ ఇలాంటి వెధవపనులు చేయకంటూ.
ఇవాళ్టి రోజుల్లో అయితే కుర్రాణ్ణి కొట్టారంటే పెద్దలెళ్ళి స్కూల్ మీద పడి టీచర్సుని తిడుతున్నారు. ఆ రోజుల్లో వాళ్ళని తిట్టడం కాదు మమ్మల్నే చితకబాదేసేవారు - మళ్ళీ ఇంట్లో "వెధవా! తప్పు చేశావు" అన్చెప్పి.
ఒక సంగతి మర్చిపోయాను - ఫిఫ్తుఫారంలో వున్నప్పుడు మా అన్నయ్యగారికి అమ్మాయి పుట్టింది - విజయవాడలో ప్రసవించారు మా వదినగారు. విజయవాడలో విజయా మెడికల్ సిండికేట్లో పనిచేసే వారు మా అన్నయ్య. మా వదినవారిని ప్రసవం అయ్యాక ఐదో నెల్లో ఒకసారి అనాతవరం తీసుకొచ్చారు.
విశాఖపట్నంలో మా అక్కయ్య లలిత, బావగారు రామంగారు (లాయరుగారు) వుండేవాళ్ళు. విశాఖ నుంచి మా లలిత కూడా ప్రసవానికి వచ్చింది. ఆమెకీ ఆడపిల్ల పుట్టింది.
వదినగారు, లలిత అక్కయ్య ఓ పదిహేను రోజులు అనాతవరంలోనే ఉన్నారు. అంతలో మా వదినగార్ని విజయవాడ పంపించాలి - మరి మా అక్కయ్యని వైజాగ్ పంపించాలి.
మా అక్కయ్య " నేను కూడా విజయవాడ వెళ్తాను - అక్కడ నాలుగు రోజులుండి వైజాగ్ వెళ్తాను " అంది.
వాళ్లకి ఎస్కార్టుగా నన్ను పంపించారు - నాకు సెలవులప్పుడు.
బోల్డు లగేజీ.
ఈ లోపులో - మా పెద్దక్క పాపాయి అమలాపురంలో ఉండేది - "నేను కూడా వస్తాను, మంగళగిరి చూద్దాం అందరం కలిసి" - అంది.
మేమందరం కలిసి బయల్దేరి - రాజమండ్రి వెళ్ళి - ఈ రాజమండ్రేంటంటే బొబ్బర్లంక వెళ్ళి అక్కడ్నుంచి లాంచీ ఎక్కి లాంచీలో గోదారిమీదెళ్ళాలి - వెళ్ళి - రాజమండ్రి వెళ్ళి అక్కడ విజయవాడకి ట్రైన్ ఎక్కాలన్నమాట. అదీ అప్పటి పరిస్థితి.
మా ఇంట్లో వున్న అలవాటేంటంటే - పళ్ళయ్య ఉండేవాడు కదా మా ఇంట్లో !?- ఎవరు ఊరు వెళ్ళినా కూడా - ఇటు వేపు వెడితే బొబ్బర్లంక రేవు గోదారి దాటి లాంచీ మీద అవతల ట్రైన్ ఎక్కేవరకూ ఉండాలి - ట్రైన్ ఎక్కించి మళ్ళీ అతను వెనక్కి వెళ్ళిపోతాడు. అలాగే అటువైపు కాకినాడవైపు విశాఖపట్నం వెళ్ళాలంటే - ముక్తేశ్వరం వచ్చి రేవు దాటించి కోటిపల్లిలో మమ్మల్ని బస్సెక్కించి వెనక్కెళ్ళిపోయేవాడన్నమాట. ఇది మామూలు ప్రాక్టీసు మాకింటి దగ్గర అప్పుడు.
సరే! ఈ పళ్ళయ్య కూడా మాతో పాటొచ్చాడు.
లగేజీ, పిల్లలు, మా ఇద్దరక్కయ్యలు, మా వదినగారు, ఎస్కార్ట్ నేను - రాజమండ్రి వెళ్ళిపోయాం. వెళ్ళి టౌన్స్టేషన్కి వెళ్ళాం.
వెళ్ళాక - పళ్ళయ్యని లగేజీ పట్టుకోమని - అందరినీ ప్లాట్ఫారం మీదకెళ్ళిపొండి - టికెట్లు నేను పట్టుకొస్తానని చెప్పి - నేనేం చేశానంటే - విజయవాడకి టిక్కెట్లు తీశాను నాలుగు. ప్లాట్ఫారంటికెట్టు మర్చిపోయాను. అప్పటికహలు గుర్తు లేదు నాకు - తీయాలని కూడా తట్టలేదు.
టికెట్లు తీసుకుని వెళ్ళిపోయాం స్టేషన్ లోపలికి. ఈలోగా హౌరా నుంచి మెయిలొచ్చింది. ఆ మెయిల్లో విజయవాడ వెళ్ళాలి. లగేజీ అంతా సర్దేసుకుని మెయిలెక్కేశాం.
ఎక్కేసేటప్పటికీ - మెయిలు కదలబోతుండగా పళ్ళయ్య గబగబా నా దగ్గరకొచ్చి - "బాబిగారు - నేను బయటికెళ్ళాలి - ఎలాగా - ఎలా వెళ్ళాలి?' - అన్నాడు.
అప్పుడు గుర్తుకొచ్చింది - అమ్మో- ప్లాట్ఫారం టికెట్ తీయలేదని.
ఎదురుగుండా నల్ల కోటేసుకుని స్టేషను మాస్టరెవరో కనబడుతున్నాడు. ఆయన్ని చూపించి "పళ్ళయ్యా! ఓ పని చెయ్యి - ఆయన దగ్గరకెళ్ళి అడుగు. ఎలా వెళ్ళాలో ఆయన చెప్తాడు" - అని చెప్పేసి - పళ్ళయ్యకి భోజనానికి, వెనక్కి వెళ్ళడానికి డబ్బులిచ్చి - మేం వెళ్ళిపోయాం.
ఈ పిచ్చి పళ్ళయ్యేమో ఆయన దగ్గరికెళ్ళి - "నేనూ మా కామందులూ వచ్చామండి అమలాపురం నుంచి. నేను మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవాలి. ఎలా వెళ్ళాలి చెప్ప" మంటే - సరే ఇక్కడే కూర్చో అనీ - "టికెట్టుందా , ప్లాట్ఫారం టికెట్టూ?" - అనడిగాడట ఆయన.
"నాకేం ఇవ్వలేదండీ మా కామందులూ" - అని పళ్ళయ్య జవాబు.
అది వినగానే పళ్ళయ్యని రైల్వే పోలీసులకి అప్పగించేశాడాయన.
ఆ రోజుల్లో రైల్వే పోలీసులకి అప్పగిస్తే తిన్నగా సెంట్రల్ జైలుకి పట్టుకుపోయేవారు.
పళ్ళయ్యని ఆ పళంగా రాజమండ్రి సెంట్రల్ జైలుకి తీసుకెళ్ళి అతను కట్టుకున్న పంచె, చొక్కా, భుజం మీది తువ్వాలు తీసేసి జైలుడ్రెస్సు వేసేశారు చారలది - వేసేసి లాకప్పులో పడేశారు.
సరే - మేమూ విజయవాడ వెళ్ళిపోయాం.
ఇక్కడ ఇంటి దగ్గర మా నాన్నగారు వాళ్ళు రెండు రోజులకీ పళ్ళయ్య రాకపోతే - లగేజీ అదీ వుంది కదా, పళ్ళయ్యని కూడా విజయవాడ తీసుకుపోయి ఉంటార్లే - అనుకున్నారు. మేమేమో ఈ పాటికి ఇంటికెళ్ళి పోయి వుంటాడులే అనుకున్నాం.
కానీ ఆ రెండు రోజులూ జైల్లో వున్నాడు పళ్ళయ్య.
అదృష్టవశాత్తూ ఆ జైల్లో తెలిసున్న కానిస్టేబుల్ ఒకడు చూశాడు పళ్ళయ్యని.
"ఏంటి పళ్ళయ్యేగారూ - ఇక్కడున్నారు?" అడిగితే పళ్ళయ్య ఏడుస్తూ - ఇలా ఇలా జరిగింది - అని చెప్తే - పాపం అతను - ఇంటికెళ్ళాక పంపిద్దురు గానీ - అని డబ్బులు కట్టి, విడిపించి - ఇంటికి పంపించాడు.
పళ్ళయ్య అనాతవరం వెళ్ళి - గుమ్మంలోంచే ఏడుస్తూ వెళ్ళి మా నాన్నగారికి జరిగిందంతా చెప్తే ఆయన అది విని ఆ కానిస్టేబుల్కి పంపించాల్సిన డబ్బులు - మనియార్డర్ కట్టమని మళ్ళీ పళ్ళయ్యకే ఇచ్చి పంపించారు.
ఈ విషయం మా నాన్నగారు - మేము విజయవాడనుంచి విశాఖ వెళ్ళేలోగా ఓ పోస్టుకార్డు మీద రాసి - విశాఖపట్నం మా లలిత అక్కయ్య మావగారికి పోస్ట్ చేశారు.
మేమీలోగా ఇక్కడ విజయవాడ వెళ్ళాం కదా! - అక్కడ అమ్మన్నత్తయ్య అనీ మా తాతగారి దాయాదుల సంతానంలో ఒకరు - ఆవిడ కొడుకు రామకృష్ణగారని విజయవాడలో వుండేవారు.
ఆ అమ్మన్నత్తయ్య, మా అక్కలు, నేను - అందరం కలిసి మంగళగిరి వెళ్ళాం.
చక్కగా నడుచుకుంటూ మెట్లెక్కి కొండ మీదికి వెళ్ళాం.
పూజారి ఏదో పనుండి కిందికి వెళ్ళాడు. ఎంతసేపటికీ పైకి రావట్లేదు.
ఈలోగా నేను మా అమ్మన్నత్తయ్య దగ్గరికెళ్ళి "చూడు అమ్మన్నత్తయ్యా - నువ్వు కూడా స్నానం చేసి మంచి పొత్తుపంచె కట్టుకొచ్చావ్ - ఆ శఠగోపం ఏదో మా నెత్తిన పెట్టి, ఆ ప్రసాదం ఏదో పెట్టేస్తే మనం కిందకి వెళ్ళిపోవచ్చు కదా - ఎంతసేపుంటాం ఇక్కడ ఇలా మనం?" - అన్నాను.
పాపం - ఆవిడ " వద్దురా బాబూ. ఆయన మళ్ళీ వచ్చి ఏమన్నా అనుకుంటాడు - మనకొద్దులే - కాసేపు కూర్చుందాంలే" - అంది.
"అలా కాదు చేయవమ్మా తల్లీ. ఏమనుకోడు - నేను చెప్తాను కదా ఆయన్తోటి?!" - అనేటప్పటికి మా అమ్మన్నత్తయ్య - వెర్రావిడ - గబగబా వెళ్ళి ఆ పళ్ళెం పట్టుకొచ్చేసి - ఆ శఠగోపం మా నెత్తిన పెట్టేసి, తీర్థం చేతుల్లో పోసేసి, పూలు, ప్రసాదం పెట్టేసింది.
ఈ లోపులో పూజారి రానే వచ్చాడు. వచ్చి ఇంక ఆయన ఒక మాట కాదు - "తల్లీ - ఈ పనేంటిది ? నేనిదంతా సంప్రోక్షణ చేసుకోవాలి - ప్ర్రాయశ్చిత్తం చేసుకోవాలి - అంతా అపవిత్రం చేశారు - వెళ్ళండి" - అని తెగ వాయించి పడేశాడు.
పాపం - మా అమ్మన్నత్తయ్యకి మొహం చిన్నదైపోయింది. నేనెళ్ళి దూరంగా మెట్ల దగ్గర మాట్లాడకుండా కూర్చున్నాను.
కిందకి దిగి బస్సెక్కి విజయవాడ వస్తూ ఉంటే - మా అక్కలిద్దరూ, అమ్మన్నత్తయ్య - ఈ విషయం చెప్పుకుంటూ ఉంటే బస్సులో విన్న వాళ్ళందరూ ఒకటే నవ్వు.
ఆ తర్వాత విజయవాడలో ఇంకో రెండు రోజులుండి - విశాఖపట్నం బయల్దేరాం. నేను - మా ఇద్దరక్కయ్యలూ, వాళ్ళ పిల్లలూ.
విశాఖపట్నంలో రైలు దిగి రిక్షాలు చేసుకుని ఇంటికి చేరాం - మేం గుమ్మంలో దిగేటప్పటికి - నన్ను చూసి పగలబడి నవ్వుతున్నారు అందరూ అక్కడ.
నన్ను చూసి నవ్వుతున్నారు - ఏమయిందా అని నేనకుంటూ వుంటే - లోపలి వెళ్ళగానే మా మావయ్యగారు - మా అక్క మావగారు" ఏం పని చేశావయ్యా బాబీ నువ్వు? " అన్నారు ఎదురొచ్చి.
"నేనేం చేశానండి ?" - అని నేను .
"ఆ పళ్ళయ్యని జైల్లో పెట్టించావు కదా?" అన్నారాయన.
"నేను పెట్టించడమేంటండి?" - అన్నాను అయోమయంగా.
అప్పుడాయన అనాతవరం నుంచి మా నాన్నగారు రాసిన పోస్టుకార్డు సంగతి చెప్పారు.
అలా నేను ప్లాట్ఫారం టికెట్టు తీయించకపోవడం పళ్ళయ్యకి జైలు యూనిఫారం వేయించింది.
<వచ్చేనెల తరువాయి కథ>
SLC లోకొచ్చాను.
ఫస్ట్ ఫారం నుంచి SLC వరకు మాతో పాటు ఆరుగురు ఆడపిల్లలు, ముప్ఫయి నాలుగు మంది మగపిల్లలం - మొత్తం నలభై మంది మా క్లాసులో.
SLC లో వెంట్రప్రగడ జగన్నాథరావుగారని మా హెడ్మాస్టరు - ఆయన కూడా క్లాసులు తీసుకునేవారు. అనాతవరం నుంచి తెలుగు మాస్టారు - కర్రా చంద్రశేఖర శాస్త్రిగారు, ఆకెళ్ళ సుబారావుగాని ఇంకొక టీచరు వచ్చేవారు. వెంట్రప్రగడ జగన్నాథరావుగారు భీమనపల్లిలో ఉండేవారు.
ఆరుగురు ఆడపిల్లల్లో ఒకమ్మాయి మా సుబ్బన్న మాస్టారి కూతురు - పరిమి సుబ్బలక్ష్మి. ఇంకొకామేమో సోషల్ మాస్టారి కూతురు కృష్ణవేణి. ఇంకొకమ్మాయేమో గుండాబత్తులప్రభావతి అని అనాతారం నుంచే వచ్చేది - మిల్లు వాళ్ళమ్మాయి. ఇంకో అమ్మాయి మారిశెట్టి సూర్యకుమారి అని. ఇంకొక అమ్మాయేమో క్రిస్టియన్ అమ్మాయి - డోరాగ్రేస్ అని. ఆరో అమ్మాయి పేరు గుర్తు లేదు. ఈ ఆరుగురు ఆడపిల్లలు ఫస్టుఫారం నుంచీ మాతోనే కలిసి చదువుకున్నారు.
మాకు SLC లోకి వచ్చేటప్పటికి మాథ్స్లో కాంపోజిట్టు, జెనరల్ అని రెండుండేవి. ఈ కాంపోజిట్టు కొంచెం కష్టం - ఆ ఈక్వేషన్స్ అవీ నాకు వచ్చేవి కావు. అసలే ఆల్జీబ్రా - గుండె గాబ్రా కదా! అందుకని నేను జెనరల్ తీసుకున్నా. క్లాసుని A, B సెక్షన్లు చేశారు. ఎవరి సెక్షన్ వాళ్ళం వున్నా - మాథ్స్కి మాత్రం కాంపోజిట్ వాళ్ళందరూ ఒక క్లాసుకి, జెనరల్ వాళ్ళం ఒక క్లాసుకి వెళ్ళేవాళ్ళం. ఈ రావడం - పోవడంలో ఏమైందంటే - ఒకరోజు - ఒక అమ్మాయిని - ఎవరితోనో ఆట్లాడుతూ పరిగెత్తుతూ వెళ్తూ - చూసుకోకుండా గుద్దేశాను. ఆ అమ్మాయి చేతిలో పుస్తకాలు కిందపడిపోయాయి. నేను నవ్వుకుంటూ పారిపోయాను.
అది మా హెడ్మాస్టరు చూశారు - ఎక్కడో దూరం నుంచి.
ఆయన దగ్గర ఒక అలవాటుండేది - ఆయనదగ్గర మాం... ఛి పేకబెత్తమొకటి ఆయన రూములో ఉండేది. ఆయన ఎవరినయినా కొట్టాలనుకుంటే వాడినే పంపించి ఆ బెత్తం తెప్పించేవారు. తెప్పించి చితగ్గొట్టేహేసేవారన్నమాట.
నన్ను పిలిచి "ఒరే వడ్లమానీ! అక్కడ సత్యం ఉంటాడు - వాణ్ణడిగి నేనిమ్మన్నానని చెప్పి ఆ బెత్తం తీసుకురా! " అన్నారు.
సత్యం అంటే మా బళ్ళో గంటలు కొట్టే అటెండరు.
నాకప్పుడే అర్థం అయిపోయింది - మనకు మూడింది ఇవాళ అని.
సరే! వెళ్ళాను ఊపుకుంటూ హెడ్మాస్టరు గారి ఆఫీసుకి.
సత్యం, రాజు అని ఇద్దరు ఉండేవారు. దసరా వచ్చిందంటే చెరో రెండు రూపాయలు ఇచ్చేవాణ్ణి - ఆ రోజుల్లోనే. అది అప్పటికి చాలా గొప్ప. అంచేత నేనంటే వాళ్ళకి - పాపం - ప్రత్యేక అభిమానం ఉండేది.
"సత్యం! హెడ్మాస్టరు బెత్తం తెమ్మన్నారు - అది ఇటియ్యి" అన్నాను.
వాడికి తెలుసు నన్నే కొట్టేస్తారని.
అయినా కూడా "ఎవరికీ మూడింది బాబూ ఇవాళా ?" అనడిగాడు.
"ఏమో - నాకేం తెల్సు. ఎవడో అల్లరి చేశాడు లోపల - నన్ను బెత్తం తీసుకు రమ్మన్నారు" అన్నాను.
"సరే అయితే - తీసుకెళ్ళు బాబూ!" అంటూ భద్రంగా ఇచ్చాడు బెత్తం.
ఆ బెత్తం పట్టుకుని వచ్చాను.
వచ్చేటప్పటికి "చెయ్యి పట్టమ్మా!" అని రెండు చేతులూ చాచి పెడితే తెగ బాదేహారు. చేతులు ఉబ్బిపోయినై.
ఆ ఉబ్బిపోయిన చేతులతో - ఇంకా రోజుకి ఆటల్లేవు - ఎలాగోలా కష్టపడి సైకిలు తొక్కుకుంటూ ఇంటికివెళ్ళాను.
అన్నం తినడానిక్కూడా లేదు - చేతులంతా మంటలు. మా అమ్మే - ఉయ్యాలబల్ల మీద కూర్చోబెట్టి - నోట్లో పెట్టేహేది అన్నం.
మా నాన్నగారికి అనుమానమొచ్చింది.
"ఏమైందిరా అది?" అనడిగారు.
"అబ్బే! ఏం లేదు. ఆడుతూ ఆడుతూ చేతులు కింద ఆనించేశాను. అక్కడ రాళ్ళేవో వున్నాయ్. అంచేత అవేవో తగిలాయి" - అనేదో అబద్ధం ఆడేశాను.
ఈ లోపులో - తెలుగు మాస్టారు - మా చుట్టం కూడా ఆయన - కర్రా చంద్రశేఖరశాస్త్రిగారు - ఆయనొచ్చారు.
వచ్చి - "నారాయణగారూ! - ఏడీ ఉన్నాడా మనవాడూ ?!" అన్నారు.
"ఆ రండి మాస్టారూ - ఏంటి సంగతి?" అన్నారు మా నాన్న.
"ఏం లేదు - ఇవాళ వీడూ ... ఏదో అల్లరి చేసుకుంటూ వచ్చి ఓ అమ్మాయిని గుద్దేహాడు. హెడ్మాస్టరు పట్టుకుని చితక్కొట్టేహాడు. ఎలా ఉన్నాడో చూద్దామని వచ్చాను" అన్నాడాయన.
ఇంక చూసుకోండి మా నాన్నగారు మళ్ళీ ఫుట్బాల్ ఆడేశారు నన్ను - ఇంకెప్పుడూ మళ్ళీ ఇలాంటి వెధవపనులు చేయకంటూ.
ఇవాళ్టి రోజుల్లో అయితే కుర్రాణ్ణి కొట్టారంటే పెద్దలెళ్ళి స్కూల్ మీద పడి టీచర్సుని తిడుతున్నారు. ఆ రోజుల్లో వాళ్ళని తిట్టడం కాదు మమ్మల్నే చితకబాదేసేవారు - మళ్ళీ ఇంట్లో "వెధవా! తప్పు చేశావు" అన్చెప్పి.
ఒక సంగతి మర్చిపోయాను - ఫిఫ్తుఫారంలో వున్నప్పుడు మా అన్నయ్యగారికి అమ్మాయి పుట్టింది - విజయవాడలో ప్రసవించారు మా వదినగారు. విజయవాడలో విజయా మెడికల్ సిండికేట్లో పనిచేసే వారు మా అన్నయ్య. మా వదినవారిని ప్రసవం అయ్యాక ఐదో నెల్లో ఒకసారి అనాతవరం తీసుకొచ్చారు.
విశాఖపట్నంలో మా అక్కయ్య లలిత, బావగారు రామంగారు (లాయరుగారు) వుండేవాళ్ళు. విశాఖ నుంచి మా లలిత కూడా ప్రసవానికి వచ్చింది. ఆమెకీ ఆడపిల్ల పుట్టింది.
వదినగారు, లలిత అక్కయ్య ఓ పదిహేను రోజులు అనాతవరంలోనే ఉన్నారు. అంతలో మా వదినగార్ని విజయవాడ పంపించాలి - మరి మా అక్కయ్యని వైజాగ్ పంపించాలి.
మా అక్కయ్య " నేను కూడా విజయవాడ వెళ్తాను - అక్కడ నాలుగు రోజులుండి వైజాగ్ వెళ్తాను " అంది.
వాళ్లకి ఎస్కార్టుగా నన్ను పంపించారు - నాకు సెలవులప్పుడు.
బోల్డు లగేజీ.
ఈ లోపులో - మా పెద్దక్క పాపాయి అమలాపురంలో ఉండేది - "నేను కూడా వస్తాను, మంగళగిరి చూద్దాం అందరం కలిసి" - అంది.
మేమందరం కలిసి బయల్దేరి - రాజమండ్రి వెళ్ళి - ఈ రాజమండ్రేంటంటే బొబ్బర్లంక వెళ్ళి అక్కడ్నుంచి లాంచీ ఎక్కి లాంచీలో గోదారిమీదెళ్ళాలి - వెళ్ళి - రాజమండ్రి వెళ్ళి అక్కడ విజయవాడకి ట్రైన్ ఎక్కాలన్నమాట. అదీ అప్పటి పరిస్థితి.
మా ఇంట్లో వున్న అలవాటేంటంటే - పళ్ళయ్య ఉండేవాడు కదా మా ఇంట్లో !?- ఎవరు ఊరు వెళ్ళినా కూడా - ఇటు వేపు వెడితే బొబ్బర్లంక రేవు గోదారి దాటి లాంచీ మీద అవతల ట్రైన్ ఎక్కేవరకూ ఉండాలి - ట్రైన్ ఎక్కించి మళ్ళీ అతను వెనక్కి వెళ్ళిపోతాడు. అలాగే అటువైపు కాకినాడవైపు విశాఖపట్నం వెళ్ళాలంటే - ముక్తేశ్వరం వచ్చి రేవు దాటించి కోటిపల్లిలో మమ్మల్ని బస్సెక్కించి వెనక్కెళ్ళిపోయేవాడన్నమాట. ఇది మామూలు ప్రాక్టీసు మాకింటి దగ్గర అప్పుడు.
సరే! ఈ పళ్ళయ్య కూడా మాతో పాటొచ్చాడు.
లగేజీ, పిల్లలు, మా ఇద్దరక్కయ్యలు, మా వదినగారు, ఎస్కార్ట్ నేను - రాజమండ్రి వెళ్ళిపోయాం. వెళ్ళి టౌన్స్టేషన్కి వెళ్ళాం.
వెళ్ళాక - పళ్ళయ్యని లగేజీ పట్టుకోమని - అందరినీ ప్లాట్ఫారం మీదకెళ్ళిపొండి - టికెట్లు నేను పట్టుకొస్తానని చెప్పి - నేనేం చేశానంటే - విజయవాడకి టిక్కెట్లు తీశాను నాలుగు. ప్లాట్ఫారంటికెట్టు మర్చిపోయాను. అప్పటికహలు గుర్తు లేదు నాకు - తీయాలని కూడా తట్టలేదు.
టికెట్లు తీసుకుని వెళ్ళిపోయాం స్టేషన్ లోపలికి. ఈలోగా హౌరా నుంచి మెయిలొచ్చింది. ఆ మెయిల్లో విజయవాడ వెళ్ళాలి. లగేజీ అంతా సర్దేసుకుని మెయిలెక్కేశాం.
ఎక్కేసేటప్పటికీ - మెయిలు కదలబోతుండగా పళ్ళయ్య గబగబా నా దగ్గరకొచ్చి - "బాబిగారు - నేను బయటికెళ్ళాలి - ఎలాగా - ఎలా వెళ్ళాలి?' - అన్నాడు.
అప్పుడు గుర్తుకొచ్చింది - అమ్మో- ప్లాట్ఫారం టికెట్ తీయలేదని.
ఎదురుగుండా నల్ల కోటేసుకుని స్టేషను మాస్టరెవరో కనబడుతున్నాడు. ఆయన్ని చూపించి "పళ్ళయ్యా! ఓ పని చెయ్యి - ఆయన దగ్గరకెళ్ళి అడుగు. ఎలా వెళ్ళాలో ఆయన చెప్తాడు" - అని చెప్పేసి - పళ్ళయ్యకి భోజనానికి, వెనక్కి వెళ్ళడానికి డబ్బులిచ్చి - మేం వెళ్ళిపోయాం.
ఈ పిచ్చి పళ్ళయ్యేమో ఆయన దగ్గరికెళ్ళి - "నేనూ మా కామందులూ వచ్చామండి అమలాపురం నుంచి. నేను మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవాలి. ఎలా వెళ్ళాలి చెప్ప" మంటే - సరే ఇక్కడే కూర్చో అనీ - "టికెట్టుందా , ప్లాట్ఫారం టికెట్టూ?" - అనడిగాడట ఆయన.
"నాకేం ఇవ్వలేదండీ మా కామందులూ" - అని పళ్ళయ్య జవాబు.
అది వినగానే పళ్ళయ్యని రైల్వే పోలీసులకి అప్పగించేశాడాయన.
ఆ రోజుల్లో రైల్వే పోలీసులకి అప్పగిస్తే తిన్నగా సెంట్రల్ జైలుకి పట్టుకుపోయేవారు.
పళ్ళయ్యని ఆ పళంగా రాజమండ్రి సెంట్రల్ జైలుకి తీసుకెళ్ళి అతను కట్టుకున్న పంచె, చొక్కా, భుజం మీది తువ్వాలు తీసేసి జైలుడ్రెస్సు వేసేశారు చారలది - వేసేసి లాకప్పులో పడేశారు.
సరే - మేమూ విజయవాడ వెళ్ళిపోయాం.
ఇక్కడ ఇంటి దగ్గర మా నాన్నగారు వాళ్ళు రెండు రోజులకీ పళ్ళయ్య రాకపోతే - లగేజీ అదీ వుంది కదా, పళ్ళయ్యని కూడా విజయవాడ తీసుకుపోయి ఉంటార్లే - అనుకున్నారు. మేమేమో ఈ పాటికి ఇంటికెళ్ళి పోయి వుంటాడులే అనుకున్నాం.
కానీ ఆ రెండు రోజులూ జైల్లో వున్నాడు పళ్ళయ్య.
అదృష్టవశాత్తూ ఆ జైల్లో తెలిసున్న కానిస్టేబుల్ ఒకడు చూశాడు పళ్ళయ్యని.
"ఏంటి పళ్ళయ్యేగారూ - ఇక్కడున్నారు?" అడిగితే పళ్ళయ్య ఏడుస్తూ - ఇలా ఇలా జరిగింది - అని చెప్తే - పాపం అతను - ఇంటికెళ్ళాక పంపిద్దురు గానీ - అని డబ్బులు కట్టి, విడిపించి - ఇంటికి పంపించాడు.
పళ్ళయ్య అనాతవరం వెళ్ళి - గుమ్మంలోంచే ఏడుస్తూ వెళ్ళి మా నాన్నగారికి జరిగిందంతా చెప్తే ఆయన అది విని ఆ కానిస్టేబుల్కి పంపించాల్సిన డబ్బులు - మనియార్డర్ కట్టమని మళ్ళీ పళ్ళయ్యకే ఇచ్చి పంపించారు.
ఈ విషయం మా నాన్నగారు - మేము విజయవాడనుంచి విశాఖ వెళ్ళేలోగా ఓ పోస్టుకార్డు మీద రాసి - విశాఖపట్నం మా లలిత అక్కయ్య మావగారికి పోస్ట్ చేశారు.
మేమీలోగా ఇక్కడ విజయవాడ వెళ్ళాం కదా! - అక్కడ అమ్మన్నత్తయ్య అనీ మా తాతగారి దాయాదుల సంతానంలో ఒకరు - ఆవిడ కొడుకు రామకృష్ణగారని విజయవాడలో వుండేవారు.
ఆ అమ్మన్నత్తయ్య, మా అక్కలు, నేను - అందరం కలిసి మంగళగిరి వెళ్ళాం.
చక్కగా నడుచుకుంటూ మెట్లెక్కి కొండ మీదికి వెళ్ళాం.
పూజారి ఏదో పనుండి కిందికి వెళ్ళాడు. ఎంతసేపటికీ పైకి రావట్లేదు.
ఈలోగా నేను మా అమ్మన్నత్తయ్య దగ్గరికెళ్ళి "చూడు అమ్మన్నత్తయ్యా - నువ్వు కూడా స్నానం చేసి మంచి పొత్తుపంచె కట్టుకొచ్చావ్ - ఆ శఠగోపం ఏదో మా నెత్తిన పెట్టి, ఆ ప్రసాదం ఏదో పెట్టేస్తే మనం కిందకి వెళ్ళిపోవచ్చు కదా - ఎంతసేపుంటాం ఇక్కడ ఇలా మనం?" - అన్నాను.
పాపం - ఆవిడ " వద్దురా బాబూ. ఆయన మళ్ళీ వచ్చి ఏమన్నా అనుకుంటాడు - మనకొద్దులే - కాసేపు కూర్చుందాంలే" - అంది.
"అలా కాదు చేయవమ్మా తల్లీ. ఏమనుకోడు - నేను చెప్తాను కదా ఆయన్తోటి?!" - అనేటప్పటికి మా అమ్మన్నత్తయ్య - వెర్రావిడ - గబగబా వెళ్ళి ఆ పళ్ళెం పట్టుకొచ్చేసి - ఆ శఠగోపం మా నెత్తిన పెట్టేసి, తీర్థం చేతుల్లో పోసేసి, పూలు, ప్రసాదం పెట్టేసింది.
ఈ లోపులో పూజారి రానే వచ్చాడు. వచ్చి ఇంక ఆయన ఒక మాట కాదు - "తల్లీ - ఈ పనేంటిది ? నేనిదంతా సంప్రోక్షణ చేసుకోవాలి - ప్ర్రాయశ్చిత్తం చేసుకోవాలి - అంతా అపవిత్రం చేశారు - వెళ్ళండి" - అని తెగ వాయించి పడేశాడు.
పాపం - మా అమ్మన్నత్తయ్యకి మొహం చిన్నదైపోయింది. నేనెళ్ళి దూరంగా మెట్ల దగ్గర మాట్లాడకుండా కూర్చున్నాను.
కిందకి దిగి బస్సెక్కి విజయవాడ వస్తూ ఉంటే - మా అక్కలిద్దరూ, అమ్మన్నత్తయ్య - ఈ విషయం చెప్పుకుంటూ ఉంటే బస్సులో విన్న వాళ్ళందరూ ఒకటే నవ్వు.
ఆ తర్వాత విజయవాడలో ఇంకో రెండు రోజులుండి - విశాఖపట్నం బయల్దేరాం. నేను - మా ఇద్దరక్కయ్యలూ, వాళ్ళ పిల్లలూ.
విశాఖపట్నంలో రైలు దిగి రిక్షాలు చేసుకుని ఇంటికి చేరాం - మేం గుమ్మంలో దిగేటప్పటికి - నన్ను చూసి పగలబడి నవ్వుతున్నారు అందరూ అక్కడ.
నన్ను చూసి నవ్వుతున్నారు - ఏమయిందా అని నేనకుంటూ వుంటే - లోపలి వెళ్ళగానే మా మావయ్యగారు - మా అక్క మావగారు" ఏం పని చేశావయ్యా బాబీ నువ్వు? " అన్నారు ఎదురొచ్చి.
"నేనేం చేశానండి ?" - అని నేను .
"ఆ పళ్ళయ్యని జైల్లో పెట్టించావు కదా?" అన్నారాయన.
"నేను పెట్టించడమేంటండి?" - అన్నాను అయోమయంగా.
అప్పుడాయన అనాతవరం నుంచి మా నాన్నగారు రాసిన పోస్టుకార్డు సంగతి చెప్పారు.
అలా నేను ప్లాట్ఫారం టికెట్టు తీయించకపోవడం పళ్ళయ్యకి జైలు యూనిఫారం వేయించింది.
<వచ్చేనెల తరువాయి కథ>
ఎంగేజింగ్, గ్రిప్పింగ్ & హిలేరియస్, యాజ్ యూజువల్!! 👏👏👏
రిప్లయితొలగించండిThank You :)
తొలగించండిబళ్ళో హెడ్ మాస్టారు పేకావారమ్మాయితో పెళ్ళి జరిపించేరని తెలిస్తే అయ్యయో! అంతటి వైభోగం కళ్ళారా చూడలేకపోయామని మళ్ళీ ఘనం గా ఇంటి దగ్గర నాన్నారు పెళ్ళి జరిపించే రోజులవి.. :)
రిప్లయితొలగించండిమీ వ్యాఖ్యకి ధన్యవాదాలు.
తొలగించండి"డబల్ ధమాకా" అన్నమాట శర్మ గారూ 😀😃 (అఫ్కోర్స్, మన స్కూలు చదువుల కాలం నాటికి ఈ పదం వాడుకలోకి రాలేదుగాpgo. ఈ మధ్య కాలంలో మొదలైన అడ్వర్టైజ్మెంట్ల పరిభాష ఇది).
రిప్లయితొలగించండిమీ వ్యాఖ్యకి ధన్యవాదాలు.
తొలగించండిహహహ భలే సరదా జ్ఞాపకాలండీ హిలేరియస్ :-)
రిప్లయితొలగించండిఎంజాయ్ చేస్తూ చదువుతున్న మీకు చాలా థాంక్స్!
తొలగించండి