ఎంత ఒద్దనుకున్నా , శిశిరమన్న మాట తలవకుండా - ఆకురాలుకారులో ... రంగు పూసుకుని... హంగు చేసుకుని... ఆకు ఆకు రాలు - అని poetic గా నా మాటలతో నన్నే మాయ చేసుకుని - ఎంత సర్ది చెప్పుకున్నా - బోసివవుతున్న చెట్లని చూసి ఒక్కోసారి వదిలించుకోలేని బెంగ చుట్టుముడుతుంది.
అప్పుడేం చెయ్యాలీ?
నచ్చిన పాటేదో తోడు తెచ్చుకోవాలి.
తోడొచ్చిన పాటతో దిగులు-గుబులుని తరిమికొట్టాలి.
గాలి వాలున అలవోకగ సోలి తూలు ఆకు రీతిగా - ఆ పాట జాలువారాలి.
ఈ కాలం ఇలాగే ఎల్లకాలం ఉండబోదనీ - రాలిన ప్రతి ఆకు తావునా క్రొంజివురులు మొలకెత్తుననీ - ఆ పాట మాటమాటలో చెప్పాలి.
ఆ పాట పాడిన గొంతు మెత్తగా సాగాలి - మెల్లగా పాడాలి.
వెచ్చని ఊర్పులా తాకాలి - చల్లని ఓదార్పు కావాలి.
అల్లాంటి పాటే... "బాతోం బాతోం మే" సినిమాలో కిషోర్ కుమార్ "యే పత్ఝడ్ కా మౌసమ్ - ఘడీ దో ఘడీ హై..." అని భరోసా ఇస్తున్న పాట ...
కహా తక్ - యే మన్ కో - అంధేరే ఛలేంగే?
ఉదాసీ భరే దిన్ - కభీ తో ఢలేంగే!
కహా తక్ యే మన్ కో - అంధేరే ఛలేంగే?
ఉదాసీ భరే దిన్ - కభీ తో ఢలేంగే!
కభీ సుఖ్, కభీ దుఖ్ - యహీ జిందగీ హై..
యే పత్ఝడ్ కా మౌసమ్ - ఘడీ దో ఘడీ హై...
యే పత్ఝడ్ కా మౌసమ్ - ఘడీ దో ఘడీ హై...
నయే ఫూల్ ... కల్ ఫిర్ - డగర్ మే ఖిలేంగే!
ఉదాసీ భరే దిన్ - కభీ తో ఢలేంగే!
భలే తేజ్ కిత్నా - హవా కా హో ... ఝోంకా!
మగర్ అప్నే మన్ మే - తూ రఖ్ యే భరోసా...
మగర్ అప్నే మన్ మే - తూ రఖ్ యే భరోసా...
జో బిఛ్డే సఫర్ మే - తుఝే ఫిర్ మిలేంగే!
ఉదాసీ భరే దిన్ - కభీ తో ఢలేంగే!
కహే కోఈ కుఛ్ భీ - మగర్ సచ్ యహీ హై...
లహర్ ప్యార్ కీ జో - కహీ ఉఠ్ రహీ హై...
లహర్ ప్యార్ కీ జో - కహీ ఉఠ్ రహీ హై...
ఉసే - ఏక్ దిన్ తో - కినారే మిలేంగే!
ఉదాసీ భరే దిన్ - కభీ తో ఢలేంగే!
కహా తక్ - యే మన్ కో - అంధేరే ఛలేంగే?
ఉదాసీ భరే దిన్ - కభీ తో ఢలేంగే!
********************
********************
ఈ పాట తోడుగా - చోటియ్యకూడదనుకున్నా చొచ్చుకువచ్చే శిశిరాలనీ, రానీయకూడదనుకున్నా మంచుతో ముంచెత్తే శీతవేళల్నీ - ఆడుతూపాడుతూ దాటెయ్యలనుకుంటూ...
అక్టోబర్ 10, 2020 ఏడవ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సులో నా కథ చదివే అవకాశం దొరికింది.
నేను పాల్గొన్న వేదిక ఏడవది.
ఏడవ ప్రసంగ వేదికని నిర్వహించిన పెండ్యాల శ్రీనివాస్ గారితో మొదలుపెట్టి - మాట్లాడిన వారి వరసలో - ఏడవ దాన్ని నేను.
అన్నట్టు - నా పేరులో ఆంగ్ల అక్షరాలు ఏడు (L.A.L.I.T.H.A.).
ఇంతగా కలిసొచ్చేసిన "ఏడు" కి నాకు తెలిసి ఎన్ని పేర్లున్నాయా అని ఆలోచిస్తే నాకు ఏడుకి ఒకటి తక్కువగా - తెలుగులో రెండు, సంస్కృతంలో ఒకటి, కన్నడలో ఒకటి, హిందీలో ఒకటి, ఇంగ్లీషులో ఒకటి - మొత్తం ఏడుకి ఒకటి తక్కువగా "ఏడు"కి ఉన్న పేర్లు తట్టాయి.
అయ్యో! ఇంత మంచి "ఏడు"కి ఇంకొక్క పేరు తెలిస్తే బావుండేదే అని వెతుకుతూ ఉంటే దొరికేసింది - "చక్కుపగడ".
తెలుగులో ఆరు తర్వాత ఏడు
తెలుగులోనే ఆరున్నొక్కటి ఏడు
సంస్కృతంలో సంఖ్య సప్త
కన్నడద సంఖ్యె ఏళు
హిందీలో సంఖ్యా సాత్
ఇంగ్లీషులో హెవెన్ కి rhyme అయ్యే సెవెన్
ఈ ఒకటి-తక్కువ-ఏడు పేర్లని చేస్తూ "ఏడు"
దొరికేసిందొక చక్కదనపు మాట తోడు
ఏడు ఏడని మనమనే ఏడుకి
చమత్కారమైన ఏడో పేరు
"చక్కుపగడ"
చమక్కుమన్న చక్కుపగడ
******* ******* *******
******* ******* *******
ఏడవ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సులో పాల్గొన్న తర్వాత "ఏడు" అంకె మీద మక్కువ పెరిగి - ఆ ఏడు గురించి రాసుకున్న ముచ్చట్ల తర్వాత నేను ఇక్కడ పంచుకోబోయేవి ఏంటంటే....
మొదటగా - నేను చదివిన కథ
తర్వాత - 7 వ వేదిక ప్రసంగాలు
అటు తర్వాత - 7 వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు అన్ని వేదికల play list:
ఏడక్షరాల పేరున్న నేను చదివిన (నేను రాసిన) కథ: "అమ్మకి హాఫర్లీ పరీక్ష ":
7 వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సులోపాల్గొనే సదవకాశం నాకిచ్చిన వంగూరి చిట్టెన్ రాజుగారికి, వంగూరి ఫౌండేషన్ కార్యనిర్వాహక వర్గం వారికి కృతజ్ఞతలు.
7 వ వేదిక ప్రసంగాలనినిర్వహించిన స్నేహశీలి పెండ్యాల శ్రీనివాస్ గారికి, 7 వ వేదికలో పాల్గొన్న మా అందరికీ సాంకేతిక సహకారం అందించిన మధు పెమ్మరాజు గారికి, శేషగిరి నలబోతు గారికి ధన్యవాదాలు.
7 వ వేదికలోనాతో పాటు పాల్గొన్న మిగిలిన వక్తలందరికీ అభివందనాలు, శుభాభినందనలు.
పాటలో తెర మీద ప్రముఖంగా కనిపించేవారు - అమ్మ తొడిగిన చొక్కా-లాగు వేసుకుని, అమ్మ చేత తల దువ్వించుకుని బడికెళ్ళే బుద్ధిమంతుడైన బాలుడిలా కనపడుతూ, పాట పాడుతున్న శోభన్ బాబుకి ఒక పక్కగా కృష్ణకుమారి, ముక్కామల, ఇంకో పక్కన శారద.
ఆ పాట అణువణువునా ప్రాణం పోసి జీవం నింపింది మాత్రం ఎస్పీబీ గాత్రం.
పాటలో ఉన్న మూడు చరణాలనీ మూడు రకాలుగా - ఆ చరణంలో ఉన్న భాషకి, భాషకి జతపడిన అనుభూతికి తగినట్టు భావస్ఫోరకంగా పాడిన విధానం అద్భుతం. ఆ పాడిన తీరు చెవుల్లో పోసిన అమృతం.
పాట మొదటి చరణంలో సాక్షాత్కరించే అమృతగుణోపేతులైన అమరజీవులు - ధ్యానముద్రలో ఉన్న బుద్ధుడు, కరుణామయుడు ఏసుక్రీస్తు, నిరాకారస్వరూపుడు అల్లా, ఏడుకొండల ఱేడు వేంకటేశ్వరుడు.
ఈ చరణంలో ఆబాలగోపాల-ప్రియ-బాలు-స్వరం... శాంతరస-భరితం.
పాట రెండో చరణంలో సజీవమూర్తులుగా గోచరించే ధన్యచరితులైన త్యాగమూర్తులు - మహాత్మా గాంధీ, స్వతంత్ర భారతదేశపు మొట్టమొదటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ, రెండవ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి, మొదటి రాష్ట్రపతి డాక్టర్ బాబూ రాజేంద్రప్రసాద్, ఆజాద్ హింద్ ఫౌజ్ సేనాని సుభాష్ చంద్ర బోస్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రథమ ముఖ్యమంత్రి ఆంధ్రకేసరి టంగుటూరు ప్రకాశం పంతులు, భాషాప్రయుక్తరాష్టంగా ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావాన్ని నిరాహారదీక్షాబద్ధుడై సాధించిన అమరజీవి పొట్టి శ్రీరాములు. వీళ్ళే కాకుండా గోడకి తగిలించిన చిత్రపటాల్లో భారత రాష్ట్రపతులు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్, డాక్టర్ జాకీర్ హుస్సేన్ కూడా కనిపిస్తారు.
ఈ చరణంలో ఆవేశ-భరిత-బాలసుబ్రహ్మణ్య-గళం... వీరరస-పూరితం.
పాట మూడో చరణంలో కనిపించే జీవనదాతలూ, సేవామూర్తులైన వైద్యనారాయణుల గురించి నా కంతగా తెలియదు. ఎవరికైనా తెలుసునేమో అడిగి వారి పేర్లు రాసుకోవాలి ఎప్పటికైనా.
ఈ చరణంలో దయా-పూరిత-ఎస్పీ బాలసుబ్రహ్మణ్య-గానం ... కరుణరస-ప్లావితం.
ఒకే పాటలో ఇన్ని రకాల భావాలు పలికించి - పాటను చిరంజీవిని చేసిన ధన్యజీవి మా సుబ్బయ్య.
రోజుకోసారైనా -
ఈ పాట వింటుంటాను.
ఆ గొంతులోని మాధుర్యానికి తబ్బిబ్బవుతుంటాను.
పాటని చూస్తూ - ఆ చిత్రపటాల్లో కనిపించే మహనీయులని మరొక్కసారి తలుచుకుంటుంటాను.
వాళ్ళు చేసిన త్యాగాలకి జోహార్లనుకుంటుంటాను.
నాకు అందిన హాయిని అందరికీ పంచుకోవాలని - నాకు ఇష్టమైన పాటని ఇక్కడ ... ఇలా...