గతనెల కబుర్లు : అవతారంగారి నారాయణగారి బాబి - 6 - అల్లరి, ఆటలు, ఇరవు, ఈదేసిన గోదారి
1962 ఫిబ్రవరిలో మా అన్నగారు - నానిగారు ఒరిస్సాలో కటక్లో ఉద్యోగం చేసేవారు.
మా వదినగారికి శ్రీను పుట్టాడప్పుడు.
మా వదినగార్ని - విజయవాణ్ణుంచి - నేను, మా నాన్నగారు, మా వదినగారి చెల్లెలు లక్ష్మి - తీసుకుని మేం నలుగురం బయల్దేరి కటక్ వెళ్ళాం.
నేనొక పదిహేను రోజులు కటక్లో వున్నాను.
మా నాన్నేం చెప్పారంటే - "ఒరే! నీకింక అనాతవరం, భీమనపల్లి చదువు పనికిరాదు - నేను విశాఖపట్నంలో చెప్తాను. నాని కూడా విశాఖపట్నంలో చదువుకున్నాడు. అంచేత నువ్వెళ్ళి భీమనపల్లి హైస్కూల్లో నీ పేపర్లు అవీ తీసుకుని విశాఖపట్నం రా -నేనెక్కడికి వస్తాను" - అని నన్ను బయల్దేరి వెళ్ళిపొమ్మన్నారు.
విశాఖపట్నంలో మా మేనత్త గారి ఇల్లు - మా అక్కగారు కూడా ఆ ఇంటి కోడలే.
మా పెద్దమామయ్య - అంటే మా మేనత్తగారి భర్తకి నేనంటే మంచి అభిమానం. వాళ్ళది ఉమ్మడి కుటుంబం - నలుగురు అన్నదమ్ములు. అంతా కలిసి ఒక పెద్దింట్లో వుండేవారన్నమాట.
సరే- నేను ఒరిస్సా నుంచి బయల్దేరి అనాతవరం వెళ్ళిపోయి - భీమనపల్లి హైస్కూలు కెళ్ళి ఆ పేపర్లూ అవన్నీ తీసేసుకుని - విశాఖపట్నం వచ్చాను.
ఈ లోపులో మా నాన్నగారు కూడా ఒరిస్సానుంచి విశాఖపట్నం వచ్చారు.వచ్చి నన్ను మా బావగారికి అప్పజెప్పారు - "ఇక్కడే పెట్టి చదివించండి - వీడక్కడుంటే ఎందుకూ పనికిరాడు" - అని చెప్తే మా బావగారు BT కాలేజ్ అంటే భారత్ ట్యుటోరియల్ కాలేజ్ - డాబాగార్డెన్సులో ఉండేది - అందులో ఆయన ఫ్రెండ్ ఉండేవాడు - కందాళ శ్రీనివాస్ అని చెప్పేసి.
ఆయన కూడా లాయరు - మా బావగారి లాగే.
ఆయన దగ్గరుంటే బుద్ధిగా చదువుకుంటాననే ఉద్దేశ్యంతో BT కాలేజ్లో చేర్చారు.
అందులో - నేను , మా బాబాయిగారబ్బాయి నర్సింమూర్తి - మేమిద్దరం అక్కడ చేరాం.
బావగారు, ఆయన తమ్ముడు రామచంద్రం - నాకన్నా పెద్దవాళ్ళు.
ఇంట్లో ఇంకా మనకి ఫ్రెండ్స్ ఎవరంటే - మా రెండో మావయ్య - సూర్యనారాయణ గారు - సూరి మావయ్య అనేవాళ్ళం - ఆయన కొడుకు చిన్నభాస్కరం, సోమేశ్వర్రావు మావయ్య కొడుకు చిట్టిగాడు, నర్సింమూర్తి, వాడి అన్న రామసూర్యం, తర్వాత ఇంట్లోనే ఉండే - కోటి అని అనాతవరం నుంచి వచ్చాడు - కోటిగాయత్రి అని పాపం! కొంచెం బీదవాళ్ళు. ప్రభాత్ థియేటర్ అని ఉండేది - అక్కడ గేట్కీపర్గా పని చేసేవాడు. ఆ థియేటర్లో ఏ సినిమా వచ్చినా కూడా ఫ్రీగా వాడే పంపించేసేవాడు.
ఆ రకంగా విశాఖపట్నం కాలేజ్లో చేరాక నాకు ఇంగ్లీషు కొంచెం మెరుగుపడింది.
లెక్కల్లో ఇంక gem అయిపోయాను. భూతేశ్వర్రావు అని పేరు కూడా పెట్టానుఆయనకి - ఒరిస్సా నుంచి వచ్చారు - లెక్కల మాష్టారు - పాత్రుడు గారు. చాలా బాగా చెప్పేవారు లెక్కలు. ఆయన శిక్షణలో నాకు లెక్కల్లో ఎప్పుడూ తొంభైకి పైనే మార్కులు.
ఇంట్లో ఎక్కడ చూసినా కాయితాలన్నీ నా లెక్కలతోనే ఉండేవి. General Mathsలో నేను చేయలేని లెక్క ఉండేది కాదు.
నాకు సాయంత్రం ఉండేవి క్లాసులు. పగలంతా ఇంట్లోనే ఉండేవాణ్ణి. సాయంత్రం ఆరింటికి వెళ్ళి పదింటికి ఇంటికి వచ్చేవాణ్ణి.
BT కాలేజ్లో జోగయ్య మాష్టారు తెలుగు చెప్పేవారు. నరసింహారావుగారు సాంఘిక శాస్త్రం అంటే సోషల్ స్టడీస్ చెప్పేవారు.
జోగయ్య మాష్టారికి నేనంటే బాగా అభిమానం నేను వ్యాకరణం - సంధులూ, సమాసాలూ, అలంకారాలూ - అవీ బాగా చెప్పేవాణ్ణని.
మా సోషల్ మాష్టారు నరసింహారావుగారు ఒకసారి చరిత్రలో అశోకుడి పాఠం చెప్పారు - అశోకుడు మగధ సింహాసనం అధిష్టించాడు, చెట్లు నాటించాడు, బావులు తవ్వించాడు - అంటూ.
ఆయన మరుసటి రోజు పాఠం మొదలు పెట్టే ముందు - క్రితం రోజు చెప్పిన పాఠం గురించి ప్రశ్నలు వేసేవారు.
అలా ప్రశ్నలు అడుగుతూ నన్ను లేపి - "ఒరే వడ్లమానీ ! లే ! అశోకుడు మగధ సింహాసనం ఎక్కాక ఏం చేశాడో చెప్పు! " అన్నారు.
నేను వెంటనే - రెండు చేతులు కట్టుకుని - "కూర్చున్నాడండి -ఆయ్!" అన్నాను.
అంతకన్నా వెంటనే ఆయన "ఆరి భడవా! అశోకుడు సింహాసనం ఎక్కి కూర్చున్నాడా? అయితే నువ్వు బెంచెక్కి నించో! " అని నన్ను బెంచెక్కించి ఆ పీరియడంతా నన్ను బెంచీ మీద నించోబెట్టేశారు.
మా మాష్టార్లకి - కోనసీమ యాసలో - ఆయ్! అంటూ మాట్లాడే నా మాటలు ఎంతిష్టమో! మళ్ళీ మళ్ళీ మాట్లాడించి సరదాగా వింటుండేవాళ్ళు.
ఇలా సరదాగా చదువుకుంటూ BT కాలేజ్లో SSLC ఫస్టుక్లాసులో పాసయ్యాను - 1963 మార్చ్లో.
<వచ్చేనెల తరువాయి కథ>
1962 ఫిబ్రవరిలో మా అన్నగారు - నానిగారు ఒరిస్సాలో కటక్లో ఉద్యోగం చేసేవారు.
మా వదినగారికి శ్రీను పుట్టాడప్పుడు.
మా వదినగార్ని - విజయవాణ్ణుంచి - నేను, మా నాన్నగారు, మా వదినగారి చెల్లెలు లక్ష్మి - తీసుకుని మేం నలుగురం బయల్దేరి కటక్ వెళ్ళాం.
నేనొక పదిహేను రోజులు కటక్లో వున్నాను.
మా నాన్నేం చెప్పారంటే - "ఒరే! నీకింక అనాతవరం, భీమనపల్లి చదువు పనికిరాదు - నేను విశాఖపట్నంలో చెప్తాను. నాని కూడా విశాఖపట్నంలో చదువుకున్నాడు. అంచేత నువ్వెళ్ళి భీమనపల్లి హైస్కూల్లో నీ పేపర్లు అవీ తీసుకుని విశాఖపట్నం రా -నేనెక్కడికి వస్తాను" - అని నన్ను బయల్దేరి వెళ్ళిపొమ్మన్నారు.
విశాఖపట్నంలో మా మేనత్త గారి ఇల్లు - మా అక్కగారు కూడా ఆ ఇంటి కోడలే.
మా పెద్దమామయ్య - అంటే మా మేనత్తగారి భర్తకి నేనంటే మంచి అభిమానం. వాళ్ళది ఉమ్మడి కుటుంబం - నలుగురు అన్నదమ్ములు. అంతా కలిసి ఒక పెద్దింట్లో వుండేవారన్నమాట.
సరే- నేను ఒరిస్సా నుంచి బయల్దేరి అనాతవరం వెళ్ళిపోయి - భీమనపల్లి హైస్కూలు కెళ్ళి ఆ పేపర్లూ అవన్నీ తీసేసుకుని - విశాఖపట్నం వచ్చాను.
ఈ లోపులో మా నాన్నగారు కూడా ఒరిస్సానుంచి విశాఖపట్నం వచ్చారు.వచ్చి నన్ను మా బావగారికి అప్పజెప్పారు - "ఇక్కడే పెట్టి చదివించండి - వీడక్కడుంటే ఎందుకూ పనికిరాడు" - అని చెప్తే మా బావగారు BT కాలేజ్ అంటే భారత్ ట్యుటోరియల్ కాలేజ్ - డాబాగార్డెన్సులో ఉండేది - అందులో ఆయన ఫ్రెండ్ ఉండేవాడు - కందాళ శ్రీనివాస్ అని చెప్పేసి.
ఆయన కూడా లాయరు - మా బావగారి లాగే.
ఆయన దగ్గరుంటే బుద్ధిగా చదువుకుంటాననే ఉద్దేశ్యంతో BT కాలేజ్లో చేర్చారు.
అందులో - నేను , మా బాబాయిగారబ్బాయి నర్సింమూర్తి - మేమిద్దరం అక్కడ చేరాం.
బావగారు, ఆయన తమ్ముడు రామచంద్రం - నాకన్నా పెద్దవాళ్ళు.
ఇంట్లో ఇంకా మనకి ఫ్రెండ్స్ ఎవరంటే - మా రెండో మావయ్య - సూర్యనారాయణ గారు - సూరి మావయ్య అనేవాళ్ళం - ఆయన కొడుకు చిన్నభాస్కరం, సోమేశ్వర్రావు మావయ్య కొడుకు చిట్టిగాడు, నర్సింమూర్తి, వాడి అన్న రామసూర్యం, తర్వాత ఇంట్లోనే ఉండే - కోటి అని అనాతవరం నుంచి వచ్చాడు - కోటిగాయత్రి అని పాపం! కొంచెం బీదవాళ్ళు. ప్రభాత్ థియేటర్ అని ఉండేది - అక్కడ గేట్కీపర్గా పని చేసేవాడు. ఆ థియేటర్లో ఏ సినిమా వచ్చినా కూడా ఫ్రీగా వాడే పంపించేసేవాడు.
ఆ రకంగా విశాఖపట్నం కాలేజ్లో చేరాక నాకు ఇంగ్లీషు కొంచెం మెరుగుపడింది.
లెక్కల్లో ఇంక gem అయిపోయాను. భూతేశ్వర్రావు అని పేరు కూడా పెట్టానుఆయనకి - ఒరిస్సా నుంచి వచ్చారు - లెక్కల మాష్టారు - పాత్రుడు గారు. చాలా బాగా చెప్పేవారు లెక్కలు. ఆయన శిక్షణలో నాకు లెక్కల్లో ఎప్పుడూ తొంభైకి పైనే మార్కులు.
ఇంట్లో ఎక్కడ చూసినా కాయితాలన్నీ నా లెక్కలతోనే ఉండేవి. General Mathsలో నేను చేయలేని లెక్క ఉండేది కాదు.
నాకు సాయంత్రం ఉండేవి క్లాసులు. పగలంతా ఇంట్లోనే ఉండేవాణ్ణి. సాయంత్రం ఆరింటికి వెళ్ళి పదింటికి ఇంటికి వచ్చేవాణ్ణి.
BT కాలేజ్లో జోగయ్య మాష్టారు తెలుగు చెప్పేవారు. నరసింహారావుగారు సాంఘిక శాస్త్రం అంటే సోషల్ స్టడీస్ చెప్పేవారు.
జోగయ్య మాష్టారికి నేనంటే బాగా అభిమానం నేను వ్యాకరణం - సంధులూ, సమాసాలూ, అలంకారాలూ - అవీ బాగా చెప్పేవాణ్ణని.
మా సోషల్ మాష్టారు నరసింహారావుగారు ఒకసారి చరిత్రలో అశోకుడి పాఠం చెప్పారు - అశోకుడు మగధ సింహాసనం అధిష్టించాడు, చెట్లు నాటించాడు, బావులు తవ్వించాడు - అంటూ.
ఆయన మరుసటి రోజు పాఠం మొదలు పెట్టే ముందు - క్రితం రోజు చెప్పిన పాఠం గురించి ప్రశ్నలు వేసేవారు.
అలా ప్రశ్నలు అడుగుతూ నన్ను లేపి - "ఒరే వడ్లమానీ ! లే ! అశోకుడు మగధ సింహాసనం ఎక్కాక ఏం చేశాడో చెప్పు! " అన్నారు.
నేను వెంటనే - రెండు చేతులు కట్టుకుని - "కూర్చున్నాడండి -ఆయ్!" అన్నాను.
అంతకన్నా వెంటనే ఆయన "ఆరి భడవా! అశోకుడు సింహాసనం ఎక్కి కూర్చున్నాడా? అయితే నువ్వు బెంచెక్కి నించో! " అని నన్ను బెంచెక్కించి ఆ పీరియడంతా నన్ను బెంచీ మీద నించోబెట్టేశారు.
మా మాష్టార్లకి - కోనసీమ యాసలో - ఆయ్! అంటూ మాట్లాడే నా మాటలు ఎంతిష్టమో! మళ్ళీ మళ్ళీ మాట్లాడించి సరదాగా వింటుండేవాళ్ళు.
ఇలా సరదాగా చదువుకుంటూ BT కాలేజ్లో SSLC ఫస్టుక్లాసులో పాసయ్యాను - 1963 మార్చ్లో.
<వచ్చేనెల తరువాయి కథ>
Father story 👌👌👌Very interesting.
రిప్లయితొలగించండిThanks, Syamala!
తొలగించండిహహహహ అశోకుడి ఎపిసోడ్ భలే :-) మీ నాన్నగారిని మించిన వారు గురువుగారు ఎంతైనా గురువుగారు కదా మరి.. కబుర్లు బావున్నాయండీ..
రిప్లయితొలగించండిమా నాన్నకబుర్లు చదువుతూ - మీరు పెడ్తున్న కమెంట్స్ ఆయనకి ఎంతో సంతోషాన్ని కలిగిస్తున్నాయి. దానికి మీకెన్ని థాంక్స్ చెప్పినా తక్కువే!
తొలగించండి